*"ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ హైపర్మోడ్ నాలెడ్జ్ గ్రాఫ్ ఎ ఐ ఛాలెంజ్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్లో గ్రాండ్ ప్రైజ్ (1వ బహుమతి) సాధించిన కిట్స్ వరంగల్ విద్యార్థులు”*
కిట్స్ వరంగల్కు చెందిన పావుశెట్టి యశ్వంత్ కృష్ణ, ఈషా బెల్లాడి ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ హైపర్మోడ్ నాలెడ్జ్ గ్రాఫ్ + ఎ యై ఛాలెంజ్ ఇంటర్నేషనల్ హ్యాకథాన్లో గ్రాండ్ ప్రైజ్ (1వ బహుమతి) నగదు బహుమతితో మూడు వేల యు ఎస్ డాలర్లు (2.7 లక్షల రూపాయలు)గెలుచుకున్నారు.
భారత్ నుంచి ఎంపికైన ఏకైక టీం- ఇద్దరు విద్యార్థులు కిట్స్ విద్యార్థులు కావడం గొప్ప గర్వ కారణం. ఇంటర్నేషనల్ హ్యాకథాన్ లో గ్రాండ్ ప్రైజ్ (1వ బహుమతి) గెలుచుకున్న టీం అభినందించిన కళాశాల యాజమాన్యం.
కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ ప్రొ..కె. అశోక రెడ్డి ప్రకారం, ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 533 బృందాలు పాల్గొన్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎ ఐ ) మరియు నాలెడ్జ్ గ్రాఫ్ల యొక్క వినూత్న అప్లికేషన్లను ప్రదర్శించాయి. వరంగల్లోని కాకతీయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (కిట్స్డబ్ల్యు) కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ - నెట్వర్క్స్ నుండి యశ్వంత్ మరియు ఈషాల యొక్క డేవ్ డాక్స్(DevDocs) అనే వినూత్న సాంకేతిక ప్రాజెక్ట్ గ్రాండ్ విన్నర్ (1వ బహుమతి)గా నిలిచింది.
డేవ్ డాక్స్ అనేది ఎ ఐ- ఆధారిత ప్లాట్ఫారమ్. ఇది కంపెనీ డాక్యుమెంటేషన్ నుండి రియల్ టైమ్ అప్లికేషన్స్ సమాధానాలను అందిస్తుంది, డెవలపర్ల కోసం వర్క్ఫ్లోలను సులభతరం చేస్తుంది. ఈ విశేషమైన విజయంలో భాగంగా, *వారు బాగా అర్హమైన $3000* (మూడు వేల అమెరికన్ డాలర్లు) (≈ 2.7 లక్షల రూపాయలు)అందుకున్నారు.
ఈ విషయంలో, ఈ అద్భుతమైన సాధన కోసం యశ్వంత్, ఈషాల గురించి మేము చాలా గర్విస్తున్నామని కిట్స్ వరంగల్ సంస్థలో భాగంగా వారి విజయాన్ని జరుపుకుంటున్నామని ప్రిన్సిపాల్వా తెలిపారు.
కిట్స్ వరంగల్మరియు సెంటర్ ఫర్ ఐ స్క్వేర్ ఆర్ఈ తరపున, ఈ అద్భుతమైన విజయాలు సాధించిన యశ్వంత్, ఈషా మరియు వారి తల్లిదండ్రులకు మేము హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. వారి విజయంతో చాలా గర్విస్తున్నామని మరియు కిట్స్ వరంగల్ , వారి డిపార్ట్మెంట్ యొక్కహెడ్, అధ్యాపకులు ఇన్స్టిట్యూట్ సిబ్బంది సంపూర్ణ సహకార ఇచ్చారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం యశ్వంత్, ఈషా అంకితభావం మరియు ప్రతిభను మాత్రమే కాకుండా తమ ఇన్స్టిట్యూట్ అందించిన బలమైన, సహాయక పునాదిని కూడా ప్రతిబింబిస్తుంది అని సెంటర్ ఫర్ ఐ స్క్వేర్ ఆర్ఈ హెడ్ & ప్రొఫెసర్, డాక్టర్ కె రాజ నరేందర్ రెడ్డి తెలిపారు.
"భారత్ నుంచి ఎంపికైన ఏకైక టీం- విద్యార్థులను మాజీ రాజ్య సభ సభ్యులు,కిట్స్ వరంగల్ చైర్మన్, కెప్టెన్ వి. లక్ష్మీకాంత రావు, కోశాధికారి పి.నారాయణరెడ్డి గారు హుస్నాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే & కిట్స్ వరంగల్ అడిషనల్ సెక్రెటరీ, వి. సతీష్ కుమార్ ఇతర మేనేజ్మెంట్ సభ్యులు ప్రిన్సిపాల్ ప్రొ.కె. అశోక రెడ్డి శుభాకాంక్షలతో అభినందించారు.
ఇద్దరు విద్యార్థుల సాధించిన ఘనత కిట్స్ వరంగల్కు గర్వకారణం కావడమే కాకుండా భవిష్యత్ తరాల ఆవిష్కర్తలకు పెద్ద కలలు కనడానికి భవిష్యత్ స్టార్టప్ల కోసం ఒక ప్రేరణగా కూడా ఉపయోగపడుతుంది అని సగర్వంగా తెలిపారు.
అంతర్జాతీయ స్థాయి ఆవిష్కరణలో విజేతలుగా నిలిచిన విద్యార్థులను నిర్వాహణ సభ్యులు, వివిధ విభాగాల విభాగాధిపతులు, డీన్ లు, డీన్ అకాడెమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ డా కె వేణు మాధవ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ - నెట్వర్క్స్ (సి ఎస్ ఎన్) హెడ్ & ప్రొఫెసర్, డాక్టర్ వి శంకర్ , ఐ స్క్వేర్ ఆర్ఈ హెడ్ & ప్రొఫెసర్ డాక్టర్ కె. రాజ నరేందర్ రెడ్డి, మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, యశ్వంత్ కృష్ణ తల్లిదండ్రులు, డాక్టర్ పావుశెట్టి శ్రీధర్, కెమిస్ట్రీ అసోసియేట్ ప్రొఫెసర్, & పి ఆర్ ఓ డాక్టర్ డి. ప్రభాకరా చారి, ధృతి ఎస్. దాస్, రాకేష్ కుమార్ సాహు శుభాకాక్షలతో అభినందించారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box