ప్రజాపాలన-విజయోత్సవాలలో భాగంగా హోంశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకలలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
*ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగం....
దేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారి వర్ధంతి సందర్బంగా వారికి నివాళి..
రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది.
ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన కొనసాగుతోంది.
బాబా సాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తిని రాష్ట్రంలో కొనసాగిస్తున్నాం.
అంబేడ్కర్ సాక్షిగా తెలంగాణ ప్రజలకు ఏడో గ్యారంటీగా స్వేచ్ఛను అందించాం..
ఒకనాడు రాజకీయ ఒత్తిడికి తలొగ్గి పోలీసులు పని చేసే పరిస్థితి...
కానీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి రాజకీయ ఒత్తిడి, పైరవీలకు తావు లేకుండా సమర్ధత ఆధారంగా అధికారుల నియామకాలు జరిగాయి..
పోలీస్ శాఖలో దాదాపు15 వేల నియామక పత్రాలు అందించాం..
పీజీలు, పీహెచ్డీలు చదువుకున్నవారు కూడాపోలీస్ శాఖలో చేరుతున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ముందుకు వస్తున్నారు.
సైబర్ క్రైమ్ ను నియంత్రించడంతో పాటు డ్రగ్స్ ను నిరోధించాల్సిన అవసరం ఉంది.
డ్రగ్స్ సరఫరా చేసేవారిపట్ల కఠినంగా వ్యవహరించాలి.
బీటెక్, ఎంటెక్ చదివిన వారికి సైబర్ క్రైమ్ లో డాటా అనాలసిస్ చేసేందుకు ప్రత్యేక అవకాశం కల్పించండి.
రాబోయే రోజుల్లో సైబర్ క్రైమ్ అత్యంత వేగంగా విస్తరిస్తోంది.
సైబర్ క్రైమ్ నియంత్రణకు ప్రత్యేక శిక్షణ అందించాల్సిన అవసరం ఉంది
తెలంగాణ లోకి డ్రగ్స్, గంజాయి రావాలంటే భయపడేలా పోలీస్ సిబ్బంది కృషి చేస్తున్నారు..
తెలంగాణ ప్రతిష్ట మసకబారొద్దు అంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో డ్రగ్స్ , గంజాయి లాంటివి కనిపించొద్దు.
స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ సంబంధిత వాటిని గుర్తించేందుకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి.
పోలీసులు యాజమాన్యాలకు అవగాహన కల్పించి ప్రభుత్వ ఆలోచనలను వారికి వివరించండి.
డ్రగ్స్ కేసుల్లో నిందితులకు శిక్ష పడేలా చేయాలి.
ఫాస్ట్రాక్ కోర్టుల ద్వారా నేరస్తులకు శిక్ష పడేలా చేసేందుకు చర్యలు చేపడుతున్నాం.
ట్రాఫిక్, కాలుష్యం హైదరాబాద్ నగరాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలు
ట్రాన్స్ జెండర్స్ పై గత ప్రభుత్వాలు మానవీయ కోణంతో వ్యవహరించకపోవడం వల్ల వారు నిరాదరణకు గురయ్యారు.
అందుకే ట్రాఫిక్ నియంత్రణకు వారిని నియమించడం ద్వారా వారికి మంచి భవిష్యత్ ఇస్తున్నాం..
ఈ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్స్ ను ఆదుకునేందుకు సిద్ధంగా ఉంది....
ఐపీఎస్ అధిజారి తీవ్రవాదుల దాడిలో మరణిస్తే రూ.2కోట్లు అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 6 హోంగార్డ్స్ రైజింగ్ డే...ఈ సందర్బంగా వారికి ఒక శుభ వార్త చెబుతున్నాం..
హోమ్ గార్డుల దినభత్యాన్ని రూ.921 నుంచి రూ.1000కి పెంచుతున్నాం
హోమ్ గార్డ్స్ weekly parade allowance ను నెలకు రూ.100 నుంచి రూ.200కు పెంచుతున్నాం
హోమ్ గార్డ్స్ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, accidental మరణం చెందినా Rs 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.
జనవరి నుంచి వీటన్నింటిని అమలు చేస్తాం..
శాంతిభద్రతలను కాపడటంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టను పెంచే బాధ్యత మీ చేతుల్లోనే ఉంది.
మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లండి..
అయినా పరిష్కారం కాకపోతే ఉపముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లండి..
ఆపై ఇంకేమైనా సమస్యలుంటే నేను మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటా..
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box