లక్షలాది మంది రైతులు రైతు పండుగలో పాల్గొన్నారు.. సీఎం రేవంత్ రెడ్డి

 


మీడియా సమావేశంలో  సీఎం రేవంత్ రెడ్డి .. 

పాలమూరు లో జరిగిన రైతు పండుగ లో వేలాది మంది రైతులు పాల్గొని  ఆశ్వీరాదం ఇచ్చారు..

 రైతుల ఆశ్వీరాదం ప్రభుత్వానికి గొప్ప శక్తి ని ఇచ్చింది..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న  568 రైతు వేదికల నుంచి  లక్షలాది మంది రైతులు రైతు పండుగలో పాల్గొన్నారు. 

వాస్తవాల ప్రాతిపదికన మా ప్రభుత్వం భవిష్యత్తు కార్యాచరణ ను రూపొందించుకుంటోంది..

 16 వేల మిగులు బడ్జెట్ తో 69 వేల కోట్ల అప్పులతో కాంగ్రెస్  తెలంగాణ ఇచ్చింది.. 

కేసీఆర్ నుంచి కాంగ్రెస్ అధికారం చేపట్టే నాటికి 7 లక్షల కోట్ల అప్పు తో మా ప్రభుత్వం ఏర్పడింది..

 ఏడు లక్షల కోట్ల అప్పు పైన  నెలకు  6500 కోట్ల మిత్తి చెల్లించే పరిస్థితి ఉంది..

ఏడు లక్షల కోట్ల అప్పు ఉందన్న సంగతి ఏ సందర్భంలో కూడా కేసీఆర్ ,హరీష్ రావు, ఈటెల రాజేందర్ ప్రజలకు చెప్పలేదు

అద్భుతమైన పరిపాలనను అందిస్తున్నామని, బంగారు తెలంగాణగా మారుస్తున్నామని అబద్దాలు చెప్పారు...

మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  డిసెంబర్ 9 న అసెంబ్లీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపైన శ్వేతపత్రం విడుదలచే సి వాస్తవ పరిస్థితులను ప్రజలకు వివరించాం.. 

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా దిగజారిందో ప్రజలు అర్థం చేసుకోవాలి.. 

7 లక్షల కోట్ల అప్పు ఉన్నప్పటికి  అధైర్య పడకుండా ఇచ్చిన గ్యారంటీల ను అమలు చేస్తున్నాం.. 

రైతును రాజును చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకు వెళ్తోంది..

 రుణమాఫీ, ఉచిత విద్యుత్, సబ్సిడీ ఎరువులు, మద్దతు ధర , ఉపాధి హామీ పథకం లాంటి వాటితో రైతులను ఆదుకుంటున్నాం..

2023 వానాకాలం రైతు బంధు కేసీఆర్ ఎగ్గొట్టారు.. మేం అధికారంలో రాగానే 7625 కోట్ల రూపాయలను రైతు బంధు కింద చెల్లించాం

ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశాం..  

25 రోజుల్లో  22,22,067 మంది రైతులకు  17869 కోట్ల రూపాయల రుణమాఫీ చేశాం..

మహబూబ్ నగర్ లో 2747 కోట్ల రూపాయల రుణమాఫీ ని నాలుగో విడత గా చేశాం..

మొత్తంగా 25,35,964 మంది రైతులకు  20,616  కోట్ల రూపాయల రుణమాఫీ  చేశాం..

స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇంత తక్కువ సమయంలో 20616 కోట్ల రుణమాఫీ చేయలేదు..  దేశంలో ఇది గొప్ప రికార్డు.. 

బీఆర్ఎస్ హయాంలో రెండు సార్లు కూడా  లక్ష రూపాయల రుణమాఫీ సరిగా చేయలేదు..

ఏక మొత్తంలో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి నాలుగు విడతల్లో చేశారు..

ఎన్నికల సమయంలో అవుటర్ రింగ్  రోడ్డును అమ్మి 11 వేల కోట్ల రుణమాఫీ మాత్రమే చేశారు.. 

నాలుగున్నర యేళ్లు రుణమాఫీ చేయకపోవడం వల్ల వడ్డీ కింద రైతులు 8578.97  వేల కోట్ల చెల్లించాల్సి వచ్చింది.. 

బీఆర్ఎస్ రెండో సారి  చేసిన రుణమాఫీ కేవలం  3331 కోట్ల మాత్రమే ...

బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన రుణమాఫీ ఎలాంటిదో రైతులకు తెలుసు.. 

కాంగ్రెస్ రుణమాఫీ తో రైతులు ఆనందంగా ఉన్నారు.. 

కేసీఆర్ పెట్టిన రైతు బంధు బకాయి లను మా ప్రభుత్వం చెల్లించింది.. 

రైతు పక్షపాతి అని మేం  నిరూపించుకున్నాం.. 

సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా వేస్తాం.. ఇందిరమ్మ ప్రభుత్వంలో సోనియమ్మ గ్యారెంటీ అమలు అయి తీరుతుంది..

ఎలాంటి మారిషులు వచ్చి అబద్దాలు చెప్పినా రైతులు నమ్మోద్దు..

సోనియా గ్యారంటీ  గా నేను చెపుతున్న సంక్రాంతి తర్వాత రైతు భరోసా పడుతుంది.. 

రైతు భరోసా విధివిధానాల పైన  మంత్రివర్గ ఉప సంఘం వేశాం.. 

అసెంబ్లీ సమావేశాల్లో  రైతు భరోసా  విధి విధానాలపై చర్చించి ఖరారు చేస్తాం... 

రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చేసి చూపించాం.. రైతు భరోసా కూడా ఇచ్చి తీరుతాం

మారువేషంలో వచ్చే మారిషులు బీఆర్ఎస్, బీజేపీ వాళ్ల మాటలు నమ్మొద్దు.. 

సన్న వడ్ల కు 500 రూపాయల బోనస్ పై కొందరు అపోహలు సృష్టించారు.. 

వరి కొనుగోలు కేంద్రాలను మూసి వేస్తామని, వరి వేసుకుంటే ఉరేనని కేసీఆర్ గతంలో అన్నారు..

మా ప్రభుత్వం మాత్రం సన్న వడ్లు పండించండి బోనస్ ఇస్తామని చెపుతోంది..

ఇప్పటి వరకు  31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది..

వచ్చే సీజన్ కూడా  500 రూపాయల బోనస్ కొనసాగుతుంది...

తెలంగాణ సోనా, బీపీటీ ,హెచ్ ఎం టీ లాంటి వంగడాలు వేస్తే ఎక్కువ దిగుబడి వస్తుంది.. తెలంగాణ ప్రజలు ఎక్కువగా తినే బియ్యం కూడా ఇవే.. 

తెలంగాణ భూముల్లో పండే ధాన్యాన్నే పేదలకు రేషన్ దుకాణాల్లో ఇవ్వాలని అనుకుంటున్నం.. 

సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యంతో భోజనం పెడతాం..

రాజకీయాలకు అతీతంగా రైతులకు దగ్గరగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది.. 

ప్రభుత్వం చేపడుతున్న  కార్యక్రమాలను మీడియా మరింత గా రైతులకు చేరవేయాలి..

రెండు లక్షల రూపాయల వరకు వంద శాంత రుణమాఫీ పూర్తైంది.. 

రేషన్ కార్డు లేని వారికి కూడా రుణమాఫీ అయింది.. 

రుణమాఫీ కి రేషన్ కార్డు కు సంబంధం లేదు..

దీర్ఢకాలిక రుణాలను కూడా బ్యాంక్ లు పంపించాయి.. అందుకే 31 వేల కోట్లకు పెరిగింది.. 

తప్పుడు సమాచారం ఇస్తే శిక్షలు తప్పవని చెప్పడం తో బ్యాంకు లు వివరాలు సరిచేసి ఇచ్చాయి.. 

గుజరాత్ లో మధ్య నిషేధం ఉందని బీజేపీ చెబుతోంది..  కావాలంటే అక్కడ ఏ బ్రాండ్ లు దొరుకుతాయే తీసుకెళ్లి చూపిస్తా..

కిషన్ రెడ్డి కి తెలంగాణ తో  ఏం సంబంధం ..మాట్లాడటానికి ఆయనకు  ఏం అర్హత ఉంది 

కేంద్రంలో ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు, మేం ఇచ్చిన హామీలపై చర్చించడానికి మేం సిద్ధం...

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు