రాజకీయాల్లో నిజం మాట్లాడే పరిస్థితి లేదు--జస్టిస్ ఎన్ వి రమణ

 


దేశ వర్తమాన  రాజకీయాలపై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . ప్రస్తుత రాజకీయాల్లో నిజం మాట్లాడ లేని పరిస్థితులు నెల కొన్నాయన్నారు. 

 శుక్రవారం నాడు తిరుపతిలో  జస్టిస్ ఎన్వీ రమణ పర్యటించారు. మహాత్ముడి ఆత్మకథ సత్యశోధన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకావిష్కరణలో ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రసంగించిన జస్టిస్ రమణ భూమన కరుణాకర్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. తిరుపతి ప్రజలు  ఆదరాభిమానాలు ఉన్న నాయకుడిని ఎన్నుకున్నారని అభినందించారు. పార్టీలు ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని సరిగ్గా ఉపయోగించుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. భూమనను ఉన్నత స్థానంలో ఎందుకు ఉంచడం లేదోనని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రాజకీయంగా ఇబ్బందులు వస్తాయని తెలిసినా. భూమన తనకు ఆత్మీయుడిగానే ఉన్నారని పేర్కొన్నారు.

భూమన కరుణాకర్ రెడ్డి ‘సత్యశోధన’ పుస్తకం ద్వారా గాంధీజీ జీవన సందేశాన్ని నేటి తరం ముందుకు అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయం అని సీజేఐ ఎన్.వి. రమణ అన్నారు. కరుణాకర్ రెడ్డి వ్యక్తిత్వం గురించి అరుదైన విషయాలను చెప్పారు. చేసిన తప్పును ఒప్పుకునేందుకు ఎంతో ధైర్యం కావాలని అన్నారు. కరుణాకర్ రెడ్డి తాను చేసిన తప్పును ఇవాళ అందరి సమక్షంలో ఒప్పుకున్నారంటే.. ఆయన్ని ఏ రకంగా చూడాలి, గౌరవించాలి అనే దానికి నా దగ్గర మాటల్లేవు అంటూ ప్రశంసలు కురిపించారు.

 తిరుపతిలో మరోసారి తెలుగు భాష బ్రహ్మోత్సవాలు నిర్వహించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇదే సమయంలో ప్రస్తుతం దేశంలో అమలు అవుతున్న విద్యా విధానంపై అసంతృప్తి వ్యక్తి చేశారు . ప్రస్తుత జనరేషన్ పిల్లలు గాంధీని మర్చిపోతున్న తరుణంలో ఆయన్ను మరోసారి స్మరించుకునేలా, ఆయన ఆశయాలను కొనసాగించేలా పుస్తకాన్ని రచించడం అభినందనీయం అని ‘మహాత్ముని ఆత్మకథ సత్యశోధన’ పుస్తకంపై ప్రశంసలు కురిపించారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు