ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధానిని కోరిన సిఎం జగన్

 పెండింగ్ సమస్యను లేవనెత్తిన జగన్


సోమవారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎదుట సిఎం జగన్ పెండింగ్ సమస్యను లేవనెత్తారు. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు. విభజన వల్ల   నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీని జగన్‌మోహన్‌రెడ్డి కోరారు.  గన్నవరం విమానాశ్రయంలో ప్రధానికి వీడ్కోలు పలికిన సీఎం జగన్‌ పలు విజ్ఞప్తులతో కూడిన పత్రాన్ని ప్రధానికి అందజేశారు. సోర్సు గ్యాప్‌ గ్రాంటు అంశాన్ని ప్రస్తావిస్తూ..  రూ.34,125.5 కోట్ల రూపాయలను రీసోర్స్‌ గ్యాప్‌ కింద గ్రాంటుగా ఇవ్వాలని,  తెలంగాణ డిస్కంల నుంచి ఏపీ జెన్‌కోకు రావాల్సిన రూ.6,627.28 కోట్లను ఇప్పించాలని కోరారు.  పోలవరం ప్రాజెక్టుకు సవరించిన అంచనాల ప్రకారం రూ.55,548.87 కోట్లకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేసారు.  జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రాష్ట్రానికి ఇస్తున్న రేషన్‌ విషయంలో హేతు బద్ధత లేదని  దీనివల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని  దానిని సవరించి రాష్ట్రానికి మేలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలని   రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన వైద్యకళాశాలకు తగిన ఆర్థిక సహాయం చేయాలని  భోగాపురం ఎయిర్‌పోర్టుకు సంబంధించిన క్లియరెన్స్‌లు మంజూరుచేయాలని  ఏపీఎండీసీకి ఇనుప గనులు కేటాయించాలని ప్రధానికి సీఎం జగన్‌ విజ్ఞప్తి చేశారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు