కుటుంబ పాలన చేసే వాళ్లు దేశద్రోహులు...కెసిఆర్ నుద్దేశించి ప్రధాని ఘాటు విమర్శ

 


తెలంగాణలో కుటుంబ పాలన చేసేవాళ్లు దేశద్రోహులంటూ ఘాటువ్యాఖ్యలు చేశారు ప్రధాని మోడీ. బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా  తెలుగులో ప్రసంగం మొదలుపెట్టిన ప్రధాని..పట్టుదలకు తెలంగాణ ప్రజలు పెట్టింది పేరన్నారు. తెలంగాణ అమరవీరులు నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. ఏ లక్ష్యం కోసం అమరులు ప్రాణత్యాగాలు చేశారో ఆ ఆశయాలు తెలంగాణలో ఇంకా నెరవేరలేదన్నారు. కుటుంబ పాలన కోసం తెలంగాణ ఉద్యమం జరగలేదన్నారు. కుటుంబపాలకుల వల్ల యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావడంలేదన్నారు మోడీ. కుటుంబపాలన నుంచి విముక్తి కల్పించడమే తన సంకల్పమని వెల్లడించారు. కుటుంబపాలన ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధికుంటుపడిందన్న ప్రధాని..తెలంగాణ భవిష్యత్తు, తెలంగాణ గౌరవం  కోసం బీజేపీ పోరాటం చేస్తోందన్నారు.


కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే తమ పోరాటం ఫలితాన్నిస్తోందని అర్థమవుతుందన్నారు. తెలంగాణలో మార్పు తీసుకురావాలని ప్రజలు నిర్ణయించుకున్నారని..ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను టెక్నాలజీ హబ్ గా చేయాలనుకుంటున్నట్లు మోడీ తెలిపారు. తెలంగాణ అభివృద్దిని బీజేపీ కోరుకుంటుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆశయాలను బీజేపీ కార్యకర్తలు ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. యువతతో కలిసి రాష్ట్రాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్తామన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు తన దృష్టికి వచ్చినట్లు మోడీ తెలిపారు. 
కెసి ఆర్ కు చురకలు
 సాధువైన సిఎం యోగి టెక్నాలజీని నమ్ముతుంటే అంధవిశ్వాసాలను నమ్మేవాళ్లు తెలంగాణను పాలిస్తున్నారని ప్రధాని మోడీ చురకలంటించారు. 21వ శతాబ్దంలోనూ సీఎం అంధ విశ్వాసాలను నమ్ముతున్నారని సటైర్ వేశారు. మూఢనమ్మకాలను విశ్వసించే వ్యక్తులు తెలంగాణకు ఎలాంటి న్యాయమూ చేయలేరన్న మోడీ.. అలాంటి వ్యక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. తాను సైన్స్ ను నమ్ముతానని.. మూఢనమ్మకాలను కాదని మోడీ స్పష్టం చేశారు. ఒక కుటుంబం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటోందని.. రాష్ట్రానికి ఆ  కుటుంబ పాలన నుంచి విముక్తి కావాలని అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో ప్రతి బీజేపీ కార్యకర్త  ఇదే ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు.

కుటుంబపాలకుల వల్ల యువతకు రాజకీయాల్లో అవకాశాలు రావడంలేదని మోడీ అభిప్రాయపడ్డారు. కుటుంబపాలన నుంచి విముక్తి కల్పించడమే తన సంకల్పమని స్పష్టం చేశారు. కుటుంబపాలన ఉన్న రాష్ట్రాల్లో అభివృద్ధి కుంటుపడిందన్న ప్రధాని.. రాష్ట్ర భవిష్యత్తు, గౌరవం  కోసం బీజేపీ పోరాటం చేస్తోందన్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని.. ఈసారి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని మోడీ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని ప్రసంగం సమయంలో సభా ప్రాంగణం భారత్ మాతాకీ జై, మోడీ నినాదాలతో మార్మోగింది.
అంతకుముందు బేగంపేట్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోడీకి  గవర్నర్ తమిళసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ స్వాగతం పలికారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు