మావోయిస్టు దళ లీడర్ హిడ్మా లొంగుబాటు


ములుగు ఎస్పి ఎదుట లొంగిపోయిన హిడ్మ

మావోయిస్టు పార్టీ లీడర్ హిడ్మా ములుగు ఎస్సీ ముందు బుధవారం లొంగిపోయాడు. ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి.పాటిల్ ముందు లొంగిపోయినట్టు తెలుస్తోంది.

క్రిస్తారం మండలం తొండమార్క గ్రామానికి చెందిన మాడవి హిడ్మా మావోయిస్టు పార్టీలో సభ్యుడిగా పనిచేస్తున్నారు. లొంగిపోయిన దళ సభ్యుడి నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

ఇదిలా ఉండగా మాడవి హిడ్మా అంటే అందరూ మావోయిస్టు అగ్రనేత, మోస్ట్ వాంటెడ్ అయిన హిడ్మా (41) అనుకున్నారు. ఈయన గతంలో ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు నుంచి ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. కాగా, తీవ్ర అనారోగ్యానికి గురైన హిడ్మా చికిత్స కోసం తెలంగాణలోకి వచ్చినట్టు అనుమానిస్తున్నారు. అయితే, ఇటీవల కన్నుమూసిన అగ్ర నేత ఆర్కే మృతిపై ఆరా తీసేందుకూ హిడ్మా వచ్చి ఉండొచ్చన్న వాదన కూడా ఆ మధ్య వినిపించింది.


ఆర్కే మృతిచెందిన సమయంలో హిడ్మాతో పాటు మరికొందరు మావోయిస్ట్ నేతలపై విష ప్రయోగం జరిగిందని సానుభూతిపరులు ఆరోపించారు. తనపై విష ప్రయోగం జరిగిందన్న అనుమానంతో హిడ్మా ఛత్తీస్‌గఢ్‌ను వీడినట్లు ప్రచారం జరుగుతోంది. చిన్న వయసులోనే మావోయిస్ట్ ఉద్యమంలో చేరిన హిడ్మా బస్తర్‌ ప్రాంతంలో ఉద్యమానికి వెన్నెముకగా ఉన్నారు. పీఎల్‌జీఏ-1 బెటాలియన్‌ కమాండర్‌గా, ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. కూంబింగ్‌ సమయంలో భద్రతా బలగాలపై మెరుపు దాడుల్లో హిడ్మా సిద్ధహస్తుడు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజాపూర్‌ తరెంలో సీఆర్పీఎఫ్ బలగాలు అతడు పన్నిన వ్యూహంలో చిక్కుకుని 22 మంది ప్రాణాలు కోల్పోయారు. 76మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను బలిగొన్న 2010 నాటి తడ్‌మెట్ల దాడి, 2013లో జిరామ్‌ఘాట్ దాడి, 2017లో 27 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని హతమార్చిన ఘటనలో నిందితుడు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు