ఎంఐఎం నేత అసదుద్దీన్ కాన్వాయ్ పై కాల్పులు..క్షేమంగ బయట పడిన అసదుద్దీన్

 


యూపీలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎంఐఎం పార్టి నేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కాన్వాయ్‌పై దుంగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అసదుద్దీన్  ప్రాణాలతో బయట పడ్డాడు. ఆయనకెలాంటి ప్రమాదం జరగ లేదు.  ఒవైసీ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఓ కారు మాత్రం పంక్చరైంది. తన వాహనంపై నాలుగు రౌండ్లు కాల్పులు జరిగినట్టు అసదుద్దీన్ ట్వీట్ చేసాడు.


మీరట్‌ నుంచి తిరిగి వస్తుండగా ఈ కాల్పులు జరిగాయని  ఒవైసీ అసదుద్దీన్‌ తేలిపారు. యూపీ ఎన్నికల్లో పలు స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తోంది. తమ పార్టీ అభ్యర్థుల తరఫున ఒవైసి ముమ్మర ప్రచారం చేస్తున్నారు.  ఎస్పీ, బీజేపీ పార్టీలను టార్గెట్ చేసి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఒవైసీ కాన్వాయ్‌పై దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చిజారసీ(Chhajarsi) టోల్‌ ప్లాజా వద్ద ఒవైసీ కాన్వాయ్‌పై ఈ దాడి జరిగింది. ఫైరింగ్‌ చేసినవాళ్లు ఆయుధాలు అక్కడే విడిచివెళ్లినట్టు  ఓవైసీ చెప్పారు. తాను అక్కడి నుంచి వేరే వాహనంలో వెళ్లినట్లు పేర్కొన్నారు.
కాల్పులు జరిపిన దుండగులలో ఒకరిని అక్కడే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు