స్వామి భక్తికి నజరాన - సిద్దిపేట కలెక్టర్ కు ఎమ్మెల్సి పదవి


 సిద్దిపేట క‌లెక్ట‌ర్ వెంక‌ట్రామిరెడ్డి ని ఎమ్మెల్సి  పదవి వరించనుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ కు లాయలిస్టుగా విమర్శల పాలైన ఈ అధికారిని ఎమ్మెల్సి పదవికి ఎంపిక చేసారు. వడ్డించే వారి బంతిలో కూర్చున్న  వెంకట్రామిరెడ్డి

త‌న ఐఏఎస్ ప‌ద‌వికి రాజీనామా చేశారు.  త‌న రాజీనామా లేఖ‌ను  సోమ‌వారం ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌కు  అంద‌జేశారు. అనంత‌రం వెంక‌ట్రామిరెడ్డి రాజీనామాను ప్ర‌భుత్వం ఆమోదించినట్లు ఉత్త‌ర్వులు జారీ చేసింది.
వెంక‌ట్రామిరెడ్డి స్వ‌స్థ‌లం పెద్ద‌ప‌ల్లి జిల్లా ఓదెల‌. 1991లో గ్రూప్‌-1 ఆఫీస‌ర్‌గా ప్ర‌భుత్వ స‌ర్వీసుల్లో వెంక‌ట్రామిరెడ్డి చేరారు. బంద‌ర్, చిత్తూరు, తిరుప‌తిలో ఆర్డీవోగా ప‌ని చేశారు. మెద‌క్ జిల్లాలో డ్వామా పీడీగా సేవలందించారు. హుడా సెక్ర‌ట‌రీ, జీహెచ్ఎంసీ జోన‌ల్ క‌మిష‌న‌ర్‌గా, సంగారెడ్డి, సిద్దిపేట క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఏడేండ్లు జేసీగా, క‌లెక్ట‌ర్‌గా వెంక‌ట్రామిరెడ్డి ప‌ని చేశారు.
కలెక్టర్ నూతన కార్యాలయం ప్రారభోత్సవం సందర్భంగా వెంకట్రామి రెడ్డి సిఎం కాళ్లకు మొక్కడం గతంలో విమర్షలకు దారితీసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు