బీహార్ లో మావోయిస్టుల ప్రతీకారచర్య



ఇన్ ఫార్మర్లనే ఆరోపణలతో
నలుగురిని బహిరంగంగ ఉరితీసి మావోయిస్టులు
మృతుల్లో దళిత కుటుంబానికి చెందిన ఇద్దరు పురుషులు ఇద్దరు మహిళలు


బీహార్‌లో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించీ నలుగురు వ్యక్తులను బహిరంగంగా ఉరి తీశారు. వారి ఇంటికి బాంబులు అమర్చి పేల్చి వేశారు. గయా జిల్లా దుమారియాలోని మోన్‌బార్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది.
ఏడాది క్రితం మోన్‌బార్‌ గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మరణించారు. అయితే ఇది బూటకపు ఘటన అని మావోయిస్టులు ఆరోపించారు. ఇంటి యజమానులే మావోయిస్టులకు విషమిచ్చి చంపారని మావోయిస్టులు ప్రకటించారు. విషాహారం తిని చనిపోయిన వారిపై పోలీసులు  బూటకపు ఎన్‌కౌంటర్  నిర్వహించారని మావోయిస్టుల ఆరోపణ.

మోన్‌బార్‌ గ్రామానికి భారి సంఖ్యలో వచ్చి నక్సలైట్లు శనివారం ప్రజా కోర్టు నిర్వహించి శిక్షలు అమలు చేశారు. సర్జూ భోక్తా ఇంటిని డైనమైట్లతో పేల్చివేశారు. ఆయన కుమారులు సత్యేంద్ర సింగ్ భోక్తా, మహేంద్ర సింగ్ భోక్తా, వారి భార్యల కాళ్లు, చేతులు కట్టేశారు. కళ్లకు గంతలు కట్టి వారి ఇంటి వెలుపల ఉరివేసారు.

అనంతరం ఆ ఇంటి తలుపులకు ఒక నోటీస్ అంటించారు. ఆ కుటుంబం హత్యా కుట్రకు పాల్పడిందని ఆరోపించారు. నలుగురు మావోయిస్టులు – అమ్రేష్ కుమార్, సీతా కుమార్, శివపూజన్ కుమార్, ఉదయ్ కుమార్‌లను గతంలో విషం ఇచ్చి చంపారని పేర్కొన్నారు. వీరి హత్యలో ఈ కుటుంబ ప్రమేయం ఉన్నదని ఆ నోట్‌లో పేర్కొన్నారు. ద్రోహులకు కఠిన శిక్షలు విధిస్తామంటూ మావోయిస్టులు అందులో హెచ్చరించారు.



 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు