హైదరాబాద్ లో ప్రతి ఏటా దసరా పండగ తర్వాత జరిగే అలయ్ బలయ్ కార్యక్రమం చాలా ఫేమస్. బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఆయన హర్యానా గవర్నర్ గా భాద్యతలు చేపట్టిన తర్వాత కూడ ఈ కార్యక్రమం కొనసాగించారు. జలవిహార్ లో ఆదివారం జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలంగాణ గవర్నర్ తమిళిసై, హోం మంత్రి మహమూద్ ఆలీ,కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బిజెపి తెలంగాణ చీఫ్ బండి సంజయ్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ తదితరులతో పాటు అనేక మంది ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఓ దృష్యం అందరిని ఆశ్యర్య పరిచింది. మీడియాకు చెందిన ఫోటో, వీడియో జర్నలిస్టులు తమ కెమెరాలకు పని చెప్పి ఈ దృష్యాన్ని చిత్రీకరించారు.
తెలంగాణ సిఎం కెసిఆర్ ను ఆయన కుటుంబ సబ్యులను పేరు పేరునా ఉతికి ఆరేసే బిజెపి చీఫ్ బండి సంజయ్ కెసిఆర్ కూతురు ఎమ్మెల్సి కవిత ఇద్దరు పక్క పక్కనే ఈ కార్యక్రమంలో కూర్చుని ముచ్చటించి సంభ్రమాశ్చర్యాల కు గురి చేశారు. వాళ్లు ఏ అంశంపై ప్రశాంత వదనాలతో ముచ్చటించారో తెలియదు కాని ఇప్పడీ దృష్యమాలికలు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ అయ్యాయి.
రాజకీయ విమర్శలు వేరు..వ్యక్తి గత పరిచయాలు వేరు అయినా ఇది బండారు దత్తాత్రేయ మంచి ఉద్దేశంతో నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమం కావడం వల్ల ఇక్కడ రాజకీయాల భేషజాలకు తావు లేదు. అందుకే ఈ అవకాశాన్ని వదులు కోకుండా కల్వకుంట్ల కవిత బండి సంజయ్ తో సంభాషణ కలిపి మీడియా కెమెరాలు తనవైపు ఫోకస్ అయ్యేలా చేసింది.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box