టిటిడీ పాలక వర్గంలో మై హోం రామేశ్వర్ రావుకు చోటు

 25 మందితో తుది జాబితా విడుదల 



తిరుమల తిరుపతి దేవస్థానం నూతన  పాలక మండలి జాబితాను విడుదల చేసారు. తెలంగాణ కు చెందిన  ప్రముఖ వ్యాపార వేత్త  మై హోం అధినేత జూపల్లి రామేశ్వరరావు, జీవన్‌రెడ్డి, లక్ష్మీనారాయణ, పార్థసారథిరెడ్డి, మారంశెట్టి రాములు, కల్వకుర్తి విద్యాసాగర్‌రావు ల ను పాలవర్గ సబ్యులుగా ఖరారు చేశారు. పోకల అశోక్‌కుమార్‌, మల్లాడి కృష్ణారావు, వేమిరెడ్డి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి, గొర్ల బాబూరావు, మధుసూదన్‌ యాదవ్‌ నియమితులయ్యారు. తమిళ నాడు నుండి  శ్రీనివాసన్‌, ఎమ్మెల్యే నందకుమార్‌, కన్నయ్య, కర్నాటక నుంచి శశిధర్‌, ఎమ్మెల్యే విశ్వనాథరెడ్డి, మహారాష్ట్ర నుంచి శివసేన కార్యదర్శి మిలింద్‌కు అవకాశం కల్పించారు. మారుతి, సౌరభ్‌ , కేతన్‌ దేశాయ్‌, శ్రీనివాసన్‌ పేర్లు పాలకమండలి సభ్యుల పేర్లు జాబితాలో ఉన్నట్లు సమాచారం.

ఈ సారి దక్షిణాధి రాష్ట్రాల కు చెందిన ప్రముఖులకు ప్రాధాన్యత కల్పించాలని ఎపి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశించడంతో 25మంది సభ్యుల తో తుది జాబితాను బుధవారం సాయంత్రం విడుదల చేసారు.

బోర్డు సభ్యుల వివరాలను ఈ సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి అధికారికంగా ప్రకటించారు. పాలకమండలిలో కొత్త వారికే ఎక్కువ అవకాశం కల్పించినట్టు సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక ఆహ్వానితులకు ఎలాంటి అధికారాలు ఉండవని స్పష్టం చేశారు. గత పాలక వర్గంలో మొత్తం 36 మంది సభ్యులు ఉండగా అందులో 24 మంది పాలకమండలి సభ్యులు, 8మందికి ప్రత్యేక ఆహ్వానితులుగా అవకాశం కల్పించారు. నలుగురు ఎక్స్‌ అఫిషియో సభ్యులుగా నియమితులయ్యారు. అయితే ఈసారి ఆ సంఖ్యను కుదించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికి అవకాశం కల్పిస్తూ పాలకమండలి కూర్పు జరిగిందని చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు