రేవంత్ కు విశ్వేశ్వర్ రెడ్డికి దిమ్మదిరిగే షాక్ ఇచ్చిన ఆర్ఎస్ పి


 వైట్ ఛాలెండ్ పేరిట చాలెంజ్ విసిరిన టిపిసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డికి మాజి ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బిఎస్పి పార్టి కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్న మాజి ఐపిఎస్ అధికారి ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ దిమ్మ దిరిగే షాక్ ఇచ్చారు. వైట్ ఛాలెంజ్ వలలో పడకుండా తన దైన శైలిలో తిప్పి కొట్టారు.

చివరికి మన బ్లాక్&వైట్ చాలెంజీలు తన్నులాటల,పరువు నష్టాల క్లైమాక్సుకొచ్చినయన్నమాట. రైతుల కష్టాలు, పోడు/అసైన్డ్ భూములు,కుంభకోణాలు,నిరుద్యోగ సమస్యల నుండి మన దృష్టి మళ్లించడం కోసమే ఈ హైడ్రామా! తెలంగాణ నువ్ ఎటు వైపు? ఈ చెత్త చాలెంజీల వైపా లేక చిద్రమైన బతుకుల కోసం నిలబడ్డ బహుజనుల వైపా? అని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.

బిఎస్పి నేతగా రాష్ట్రంలో బహుజన సమీకరణ కోసం నిర్విరామంగా పనిచేస్తు అన్ని జిల్లాలలో పర్యటనలు చేస్తున్న ప్రవీణ్ కుమార్ ఇప్పటికే చాలా బిజి అయ్యారు. ఎస్సి, ఎస్టి, బి,సి మైనార్టీల నేతలను స్వయంగా కల్సి ఐక్యత కోసం కషి చేస్తున్నారు. తాజా రాజకీయాల పై విసుర్లు విసురుతూ నేతల విధానాలను ఎండ గడుతున్నారు.

ఈ క్రమంలో రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ స్వీకరించిన మాజి ఎంపి విశ్వేశ్వర్ రెడ్డి మరో ఇద్దరికి ఛాలెంజ్ విసిరారు. ఆయన విసిరిన ఛాలెంజ్ లో బిజెపి చీఫ్ బండి సంజయ్ తో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు. అయితే బండి సంజయ్ ఛాలెంజ్ స్వీకరించినట్లు ప్రకటించగా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ మాత్రం ఇలా ఘాటుగా స్పందించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు