నాకూ డ్రగ్స్కీ ఏం సంబంధం? ఏ పరీక్షకైనా నేను సిద్ధం. ఎవరో ఏదో చేస్తే నాకేం సంబంధం? ఇక నుంచి ఇష్టంవచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదని కేసులు పెడతామని తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కెటిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రేస్ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన విమర్శలు తిప్పి కొడుతూ ఒకప్పుడు సున్నమేసిన వ్యక్తి.. ఇవాళ కన్నమేస్తున్నారు. నాకూ డ్రగ్స్కీ ఏం సంబంధం? ఏ పరీక్షకైనా నేను సిద్ధం అన్నారు.
మేం సంక్షేమంలో నిమగ్నమయ్యాం. హుజూరాబాద్లో తెరాస కచ్చితంగా గెలుస్తుంది. రూ.50కోట్లతో పీసీసీ కొనుక్కున్నారని ఆ పార్టీ నేతే అన్నారు. పీసీసీ పదవి కొనుక్కున్న నేత రేపు ఎమ్మెల్యే టిక్కెట్టు అమ్ముకోరా? పెయింటింగ్ వేసుకునే వ్యక్తికి జూబ్లీహిల్స్లో నాలుగు ఇళ్లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ఏ పనిలేకే తమపై బురదజల్లుతున్నాయని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. హుజురాబాద్ లో తెరాస గెలుపు ఖాయమన్నారు. నాగార్జున సాగర్లో కాంగ్రెస్ సర్వశక్తులూ ఒడ్డినా.. సీనియర్ నేత జానారెడ్డి ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. గజ్వేల్లోనే కాదు.. ఎక్కడ సభపెట్టినా హుజూరాబాద్లో కాంగ్రెస్కు డిపాజిట్ అయినా దక్కుతుందా?అని ప్రశ్నించారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box