అఫ్గన్ భారత రాయబార కార్యాలయాల్లో తాలిబన్ల సోదాలు

 పత్రాలు, కార్లు ఎత్తుకు వెళ్లిన తాలిబన్లు


భారత్ తో స్నేహస్తం చాచిన తాలిబన్లు మరో వైపు విధ్వంసాలకు పాల్పడుతున్నారు. అఫ్గనిస్తాన్ లో తాలిబన్లు భారత రాయబార కార్యాలయం లోకి చొరబడి విధ్వంసానికి ఒడిగట్టారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించారు. డాకుమెంట్లు వస్తువులు చెల్లాచెదురు చేసి కొన్నింటిని తమ వెంట తీసుకు వెళ్లారు.  అఫ్గన్ లో భారత రాయబార కార్యాలయం రెండు రోజుల క్రితమే ఖాళి చేసి మూసి వేసారు. కాందహార్, హేరాత్‌లోని భారత రాయబార కార్యాలయాల్లో తాలిబన్లు బుధవారం సోదాలు నిర్వహించారు. పత్రాల కోసం కాందహార్‌లోని అల్మరాలలో శోధించి, అక్కడ ఉన్న వాహనాలను తమవెంట తీసుకెళ్లారు.  కార్యాలయాల బయట పార్కింగ్ చేసిన వాహనాలను ఎత్తుకు వెళ్లారు. తాలిబన్ల చర్య అధికారులను ఆందోళన పరిచింది.  ఓ వైపు దేశ పౌరుల పట్ల విదేశీయుల పట్ల సమరస్యంగా ఉంటామంటూనే మరో వైపు ముష్కర చేష్టలకు పునుకోవడం పట్ల వివిద దేశాల అధికారులు అగ్రహం వ్యక్తం చేసారు.

తాలిబన్లు ఇలాంటి చర్యలకు దిగుతారని ముందే ఊహించామని ఓ సీనియర్ అధికారి మీడియాతో అన్నారు. తాలిబన్లు బయటికి చెప్తున్న విదంగా యుతంగా వ్యవహరించడం లేదని ప్రతీకారేఛ్ఛతో  తమ ప్రత్యర్థుల కోసం తాలిబన్లు ఇంటింటికి వెళ్లి వెదుకుతున్నారని అధికారులు చెప్పారు.

జాతీయ డైరెక్టరేట్ ఆఫ్ సెక్యూరిటీ కోసం పనిచేసిన అఫ్గన్లను టార్గెట్ చేసినట్టు ఐరాస నిఘా నివేదిక వెల్లడించింది. ఇక, అఫ్గనిస్థాన్‌లో కాబూల్ ఎంబసీ సహా మరో నాలుగు చోట్ల రాయబార కార్యాలయాలను భారత్ నిర్వహిస్తోంది. కాందహార్, హేరాత్, మజారే ఇ షరీఫ్ నగరాల్లోని రాయబార కార్యాలయాలను తాలిబన్లు ఆక్రమించుకోడానికి రెండు రోజుల ముందే మూసివేసారు. 

ఇదిలా ఉంటే తాలిబన్లకు ఇతర ప్రాంతాల ఉగ్రవాదుల మద్దతు లభిస్తోంది. 


అరేబియా ద్వీపకల్పంలోని అల్ ఖైదా తాలిబన్లకు అబినందనలు తెలియ చేసింది. అఫ్గనిస్థాన్‌కు విముక్తి లభించినందుకు తాలిబన్ బృందాన్ని ప్రశంసిస్తూ అభినందిస్తున్నాం అంటూ ప్రకటన విడుదల చేసింది. సిరియాలోని హయత్ తహ్రీర్ అల్-షామ్ కూడా తాలిబాన్లకు మద్దతుగా అధికారిక ప్రకటన విడుదల చేశారు. ‘హయత్ తహ్రిర్ అల్ షామ్ తాలిబాన్లను ఒక స్ఫూర్తిగా భావిస్తున్నారనడానికి ఇది సంకేతం.. బషర్‌ను బహిష్కరించి సిరియాలో ఇస్లామిక్ రాజ్యం అమలు చేయాలని భావిస్తున్నారు’ అని వ్యాఖ్యానించాయి.

పశ్చిమ చైనాలోని తుర్కిస్థాన్ ఇస్లామిక్ పార్టీ కూడా తాలిబన్లకు అభినందనలు తెలుపుతూ ప్రకటన విడుదల చేసింది. అఫ్గన్ లో రోజు రోజుకూ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.  నార్వేజియన్ సెంటర్ ఫర్ గ్లోబల్ ఎనాలిసిస్ రూపొందించిన నివేదిక ప్రకారం  కాబూల్ విమానాశ్రయానికి వెళ్తున్నవారిని తాలిబన్లు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.  గతంలోతాలిబన్లకు వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తులు, వారి కుటుంబాలను టార్గెట్ చేసారు. షరియా చట్టం ప్రకారం వారిని విచారించి, శిక్షించాలని ప్రయత్నాలు ప్రారంభించారని  ఎన్‌ఎస్జీఏకు చెందిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్రిస్టియన్ నెల్‌మన్ ఏఎఫ్‌పీ మీడియాతో అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు