కాబూల్ ఎయిర్ పోర్టులో తొక్కిస లాట - ఏడుగురు మృతి

 


అప్ఘానిస్తాన్ లో రోజులు గడిచిన కొద్ది భయానక పరిస్థితులు నెలకొంటున్నాయి. తాలిబన్ల అరాచకాలకు హద్దు అదుపు లేకుండ పోయింది. దాంతో దేశం విడిచి పోయేందుకు అనేక మంది ప్రాణాలకు  తెగిస్తున్నారు. అప్ఘాన్ రాజధాని కాబూల్ లోని అంతర్జాతీయ విమానాశ్రయం కిక్కిరిసి పోయింది.  విమానాశ్రయం జనం రద్దీతో తొక్కిస లాటగా మారింది. జనాలను అదుపు చేయడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కాల్పుల సందర్భంగా తొక్కిస లాట పెరిగి పోవడంతో ఏడుగురు మరణించారని బ్రిటన్ రక్షణ శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.

 ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్‌లో భయానక పరిస్థితుల నేపథ్యంలో అమెరికా అప్రమత్తమైంది. అప్ఘాన్ లోని తమ దేశ పౌరులెవ్వరూ కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్దకు వెళ్లకూడదని అమెరికా ఆదేశాలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్ గేట్ల వద్ద ఉద్రిక్త పరిస్ధితి వుందని ఈ సమయంలో అక్కడికి వెళ్లొద్దని ఆదేశించింది. 

ఇక ఆఫ్ఘాన్ లో చిక్కుకుపోయిన భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు గాను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా కాబూల్ నుంచి ఢిల్లీకి ప్రతి రోజు రెండు విమానాలు నడపాలని నిర్ణయించింది. 

ఇక తాలిబన్ల చెరలో వున్న భారతీయులు క్షేమంగా వున్నారు. వారిని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు విదేశాంగ శాఖ అధికారులు. అటు అమెరికాతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో ఏ క్షణంలోనైనా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన విమానంలో వారిని తరలించే అవకాశం వుంది. 

 కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద దాదాపు 150 మంది భారతీయులను బందీలుగా చేసుకున్నారు తాలిబన్లు. విమానాశ్రయం నుంచి సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు ట్రక్కుల్లో తరలించారు. ప్రయాణ పత్రాలు, గుర్తింపు  కార్డులు పరిశీలించారు. ఆఫ్ఘన్‌లో ఇంకా 1000 మందికి పైగా భారతీయులు వున్నట్లు సమాచారం. చాలా మంది భారత దౌత్య కార్యాలయం వద్ద తమ పేర్లను నమోదు చేసుకోలేదు. 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు