తాను నిర్వహించే సభలకు కేసీఆర్ సర్కార్ కరెంట్ కట్ చేస్తోందని.. తాను అధికారంలోకి వస్తే కేసీఆర్ ఫామ్ హౌస్కి కరెంట్ చేస్తానని `బీఎస్పీ రాష్ట్ర కో ఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఘాటుగా విమర్శించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో బీఎస్పీ ఉమ్మడి జిల్లా సమీక్ష సమావేశంలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతు ట్రాక్టర్లకు ఓనర్లు కాదు.. కంపెనీలకు ఓనర్లను చెయ్యాలని కేసీఆర్ సర్కార్కు ప్రవీణ్ అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ రేపే అసెంబ్లీ రద్దు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. బూతులు మాట్లాడేవాళ్లకు వర్సిటీలు ఇస్తున్నారని పరోక్షంగా మంత్రి మల్లారెడ్డిపై విమర్శలు గుప్పించారు. మల్లారెడ్డీ.. మంత్రి హోదాలో ఉండి తొడ గొట్టి మాట్లాడతారా మీ కాలేజీల్లో విద్యార్థులకు నేర్పేది ఇదేనా మల్లారెడ్డి అని సప్రశ్నించారు. మల్లారెడ్డిని వెంటనే పదవి నుంచి బహిష్కరించాలని అన్నారు. బీజేపీపైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శలు ఎక్కుపెట్టారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో జరుగుతున్న అవినీతిపై విచారణ జరిపించాలని ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
హుజూరాబాద్ ఉపఎన్నికలో ఎవరు గెలిచినా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకా లేదని అన్నారు. తెలంగాణలో ఈ సంవత్సరం ఇప్పటి వరకు 18 మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారన్నారు. నిరుద్యోగులు ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దని ప్రవీణ్ కుమార్ కోరారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box