మావాటా మేం వాడుకుంటే తప్పా ? ఎపి సిఎం జగన్

 

జలాల జగడంపై నోరు విప్పిన జగన్


కృష్ణా జలాల విషయంలో గత కొద్ది రోజులుగా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మద్య తలెత్తిన జగడంపై ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి తొలిసారిగా బహిరంగంగా స్పందించారు.  సీమ, కోస్తా, తెలంగాణకు కృష్ణా జలాల్లో వాటా గతంలోనే ఉందన్నారు. సీఅనంతపురం జిల్లా రాయదుర్గంలో గురువారం  నిర్వహించిన బహిరంగ సభల జగన్ మోహన్ రెడ్డి మాట్లాడారు. జలాల పంపిణీ విషయంలో తెలంగాణ నేతలు ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని జగన్ మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి కేటాయింపుపై గతంలోనే అగ్రిమెంట్స్ జరిగాయని అన్నారు. ఒప్పందం ప్రకారం కేటాయించిన నీళ్లను మాత్రమే వాడుకుంటున్నామని,  ఎవరికి ఎంత కేటాయింపులు జరిగాయనేది అందరికీ తెలిసిన విషయమే నని అన్నారు. ఉమ్మడి అంధ్ర ప్రదేస్ రాష్ర్టంలో 811 టీఎంసీలు (రాయలసీమకు 144 టీఎంసీలు, కోస్తాకు 367 టీఎంసీలు, తెలంగాణకు 298 టీఎంసీలు) కేటాయించారని గుర్తు చేశారు. శ్రీశైలం పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 885 అడుగులని 881 అడుగులు చేరితే తప్ప నీళ్లు కిందకు రాని పరిస్థితి ఉందని వివరించారు. సీమ ఎత్తిపోతలకు 881 అడుగుల్లో లిఫ్టు పెట్టి వాడుకుంటే తప్పేముందని జగన్ ప్రశ్నించారు. మీకు కేటాయించిన నీరు మీరు వాడుకుంటే తప్పులేదు, మాకు కేటాయించిన నీరు మేం వాడుకుంటే తప్పా అని తెలంగాణ ను ఉద్దేశించి జగన్ జగన్ ప్రశ్నించారు.

తెలంగాణ సర్కార్ కల్వకుర్తి సామర్థ్యం పెంచి నిర్మాణం చేపడుతోందని ఆరోపించారు. 796 అడుగుల్లోనే తెలంగాణ విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోందని విమర్శించారు. రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. అయితే తాము పక్క రాష్ట్రాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తెలిపారు. పాలకుల మధ్య సఖ్యత ఉండాలన్నారు. బైరవాని తిప్ప ప్రాజెక్టుకు యుద్ధప్రాతిపదికన భూసేకరణ చేపడుతామని జగన్ చెప్పారు. ప్రాజెక్టు కోసం 1,400 ఎకరాల భూసేకరణ జరగాలన్నారు ఇదే సందర్భంగా  తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాజకీయాల్లో జోక్యం చేసుకోబోనని జగన్ స్పష్టం చేశారు. భవిష్యత్తులోనూ ఇతర రాష్ట్రాల రాజకీయాల్లో జోక్యం చేసుకునేది లేదన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు