మంత్రి కేటీఆర్‌ను కలిసిన ఆక్టర్ సోనూసూద్‌


ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ తెలంగాణ మంత్రి కేటీఆర్ ని ప్రగతి భవన్ లో మంగళవారం కల్సుకున్నారు. ఈసందర్భంగా ఇద్దరు ఒకరి సేవలు ఒకరు కొనియాడారు. సోను సూద్ చేసిన సేవలను మంత్రి కెటిఆర్ ప్రస్తివించి అభినందించారు.  సోనుసూద్ ను శాలువతా సత్కరించి మెమెంటో బహుకరించారు. తన తల్లి స్పూర్తితో తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు సోనూసూద్ కేటీఆర్ కు వివరించారు. దేశవ్యాప్తంగా నెలకొన్న కరోనా సంక్షోభ కాలంలో ఒక ఆశాజ్యోతిగా, వ్యక్తిగత స్థాయిలో ఇంత భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ పట్ల, ఇక్కడి వారి పట్ల తన అనుబంధాన్ని సోనూసూద్ పంచుకున్నారు. అనంతరం ఇద్దరు కల్సి లంచ్ చేశారు. 

పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఐటి సెక్రటరీ జయెష్ రంజన్‌లు వారి వెంట ఉన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు