హైదరాబాద్ భిర్యాని కావాలన్న సోను సూద్

 


ఎప్పుడు ట్విట్టర్ లో  ఆక్టివ్ గా ఉండే  ఐటి శాఖ మంత్రి కెటిఆర్ సోను సూద్ ను తన ట్విట్టర్ గూడులోకి లాగాడు. కరోనా కష్టకాలం మొదలైనప్పటి నుండి  సోను సూద్ భాదితులకు సహాయంగా నిలిచారు.  వారిని అన్ని విధాలా ఆదుకుని ప్రశంసలతో వార్తల్లో నిలిచారు. మంత్రి కెటిఆర్ కూడ ట్విట్టర్ లో కరోనా భాదితులకు సహాయపడుతున్నారు. ఈ క్రమంలో ఓ నెటిజెన్ మంత్రి కెటిఆర్ ను ప్రశంసల్లో ముంచెత్తాడు. కెటిఆర్ బదులిస్తు తాను మంత్రిగా తన భాద్యతలు నిర్వహిస్తున్నానని అసలు హీరో సోనూసూద్ అంటూ ట్వీట్ చేసారు.  సోను సూద్ కెటిఆర్ ట్వీట్ కు స్పందిస్తూ అసలు హీరో కెటిఆరే నని తెలంగాణా లో బాగా చేశారని ప్రశంసించారు. ఇరువురు ఒకరిని ఒకరు ఇలా హీరోలంటూ ప్రశంసించుకున్న  తర్వాత ట్వీట్లు హైదరాబాద్ భిర్యాని వరకు సాగాయి. ఈ సారి హైదరాబాద్ వచ్చినపుడు కలవాలని ఉందని సోను సూద్ తన మనసులో కోరికను వెల్లడించగా ఎదురు చూస్తానంటూ కెటిఆర్ ట్వీట్ చేసాడు. తన కోసం హైదరాబాద్ భిర్యానీ సిద్దంగా ఉంచాలని సోను సూద్ కెటిఆర్ ను కోరాడు. కెటిఆర్ కోసం ముంబై నుండి మంచి వంటకాలు తీసుకు వస్తానని కూడ సోను సూద్ ప్రామిజ్ చేసాడు.  ఇక ఈ ఇద్దరూ హైదరాబాద్ లో  కల్సుకునే రోజు ఎపుడొస్తుందో చూడాలి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు