జర్నలిస్ట్ అక్రమ అరెస్ట్ కేసు హై కోర్టుకు
గుర్రంపోడు కేసులో పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్ట్ రఘు వ్యవహారం హై కోర్టుకు చేరింది. తన భర్తను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసారని రఘు భార్యలక్ష్మి ప్రవీణ హై కోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై విచారణ జరిపిన హై కోర్టు ప్రతివాదులకు నోటీసులు జారి చేసింది. అయితే బెయిల్ కోసం కింది కోర్టులో దరఖాస్తు చేసుకోవాలని హై కోర్టు సూచన చేసింది. రఘు అరెస్ట్ అక్రమమా సక్రమమా హై కోర్టు తేల్చనుంది.
రఘు అరెస్ట్ పట్ల కాంగ్రేస్ పార్టి అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రఘు అరెస్ట్ విషయంలో పోలీసుల తీరు సరిగా లేదని అన్నారు. రఘు ఏమయ్యాడో ఎవరు కిడ్నాప్ చేశారో నని ఆయన భార్య లక్ష్మి ప్రవీణ రోజంతా తీవ్ర ఆందోళన చెందారని అన్నారు. పోలీసులు అరెస్ట్ చేస్తే చట్టపరమైన అన్ని నిభందనలు పాటించాలని అన్నారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box