తనను ముప్పు తిప్పలు పెట్టిన బిజెపీని మట్టి కరిపించిన దీది
పశ్చిమ బెంగాల్ లో బిజెపి ముప్పుతిప్పలు పడ్డా వర్క్ అవుట్ కాలేదు. దీదీ మమతా బెనర్జి మూడో సారి అక్కడ హాట్రిక్ సాధించి ముఖ్యమంత్రి కాబోతున్నారు. దీదీని ఓడించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యూహం రచించినా ఫలించలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోది పాచికలు పార లేదు. మొత్తం మోది మంత్రివర్గం అంతా అక్కడే తిష్ట వేసి గల్లిగల్లితిరిగినా బెంగాల్ ఓటర్లు దీదీకే బ్రహ్మరథం పట్టారు. ఒంటి కాలితో దీది శివంగిలా కమలానాధులతో తల పడి త్రుణమూల్ కాంగ్రేస్ పార్టీని మూడో సారి అధికారం లో నిల బెట్టారు.
దేశ ప్రజలంతా బెంగాల్ వైపు చూసారు. అందుకు బెంగాల్ ప్రజలిచ్చిన విలక్షణ తీర్పు దేశ రాజకీయాలను మలుపు తిప్ప బోతోందనడంలో సందేహం లేదు. కాశాయ కూటమికి వ్యతిరేకంగా దీదీ ఇక దేశమంతా ఏకం చేయడం ఖాయమని అప్పుడే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేసారు.
ఏమైనా బెంగాల్ లో జరిగింది మంచి పరిణామం. మమతా బెనర్జి గెలవడం ఒక బెంగాల్ రాష్ట్ర ప్రజలకే కాదు యావత్ భారత దేశ ప్రజలకు కూడ మంచి శుభ సూచకం. ఎందుకంటే దేశంలో గట్టి ప్రతి పక్షం అయిన కేంగ్రేస్ పార్టి ఇప్పటికే బిజెపీని ఎదుర్కోవడంలో చతికిల పడి పోయింది. బిజెపి ముందు కాంగ్రేస్ పార్టి పావులు పారడం లేదు. కాంగ్రేస్ పార్టీని ఎందుకో దేశ ప్రజలు అంతగా విశ్వసించడంలేదు. ఇక మమతా బెనర్జి నాయకత్వంలో బిజెపి యేతర పార్టీలతో కొత్తగా కూటమి ఏర్పడ నుందనే ఆశ ప్రజాస్వామ్య వాదుల్లో నెలకొంది. అందులో దీది ఎంత వరకు కృత కృత్యులు కాకనున్నారో చూడాలి. బెంగాల్ ఎన్నికలకు ముందే దీది గతంలో కూటమి దిశగా ప్రయత్నాలు చేసారు.
నేనే ముఖ్యమంత్రి
‘నందిగ్రామ్లో నా ఓటమిని అంగీకరిస్తున్నాను. ఎన్నికల సంఘం బీజేపీ ప్రతినిధిలా పని చేసింది. ఈసీపై సుప్రీం కోర్టుకు వెళ్తా. నేను నందిగ్రామ్లో ఓడినా.. 221 సీట్లు గెలుచుకున్నాం. ముఖ్యమంత్రిగా నేనే ప్రమాణ స్వీకారం చేస్తాను. త్వరలో తేదీ ప్రకటిస్తా’ అన్నారు దీదీ.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box