యాచకులకు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించిన పోలీసులు


వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరంగల్, హన్మకొండ పట్టణాలలో నివసించే 150 మంది  యాచకులకు పోలీసులు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సహకారంతో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. పోలీస్ కమీషనర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు నగరంలోని పలు ప్రాంతాలకు చెందిన యాచకులను వరంగల్ కొత్త బస్ స్టాండ్ ,హన్మకొండ పబ్లిక్ గార్డెన్ లో కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు.    పోలీస్ కమీషనర్ డాక్టర్ తరుణ్ జోషి స్వయంగా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించడమే కాక యాచకులకు,,మాస్కులు పండ్లు పంపణి చేసారు.

డి.సి.పి పుష్ప, డిప్యూటి డిఎంఅండ్ హెచ్ వో యాకుబ్ పాషా, హన్మకొండ, వరంగల్ ఎ.సి.పిలు, జితేందర్ రెడ్డి, గిరికుమార్ హన్మకొండ, మట్వాడా, ఇంతేజార్ గంజ్, మీల్స్ కాలనీ,సుబేదారి ఇన్స్ స్పెక్థర్లు చంద్రశేఖర్ గౌడ్, గణేష్,వెంకటేశ్వర్లు,రవికిరణ్,రాఘవేందర్, హన్మకొండ ఎస్.ఐ రవీందర్ తో పాటు పోలీసులు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు