కొండ పోచమ్మ సాగర్ జలాలు విడుదల చేసిన కెసిఆర్

 


కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో భాగంగా కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం నీటిని విడుదల చేశారు.

మంగళవారం ప్రత్యేక బస్సులో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్.. అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు.ఆ తర్వాత, మర్కూర్ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకుని ప్రత్యేక పూజ‌లు చేసి, కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు.

ఈ జలాలతో పరిసర ప్రాంతాల్లోని పాములపర్తి చెరువు, పాతురు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపుర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను గోదావరి నీటితో నింపనున్నారు.

ఇప్పటికే మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు.. అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్‌కు చేరాయి. ఇవాళ కొండపోచమ్మ సాగర్ నుంచి జలాలను సీఎం కేసీఆర్‌ హల్దీ వాగులోకి వదిలారు. ఈ నీరు మంజీరా నది ద్వారా నిజాంసాగర్‌కు చేరనుంది. కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కాల్వ ద్వారా సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపనున్నారు.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎంకేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటిందని టిఆర్ఎస్ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి.

కార్య‌క్ర‌మాల్లో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు  హ‌రీష్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, ఎంపీలు,  జోగినపల్లి సంతోష్ కుమార్ కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, బీబీ పాటిల్, ఎమ్మెల్సీలు శేరి సుభాష్ రెడ్డి, భూపాల్ రెడ్డి, గంగాధర్ గౌడ్,  ఫరీదుద్దీన్,  ఫరూక్ హుసేన్, రాజేశ్వర్ రావు, ఎమ్మెల్యేలు ప‌ద్మా దేవేంద‌ర్ రెడ్డి,  బాజిరెడ్డి గోవర్దన్, గణేష్ గుప్తా హన్మంత్ షిండే,  ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి,  చిరుమర్తి లింగయ్య,సీహెచ్ మదన్ రెడ్డి,  మహీపాల్ రెడ్డి,  మాణిక్ రావు, సీఎం కార్యదర్శులు స్మితా సభర్వాల్, నీటిపారుదల శాఖ ప్రత్యేక పధాన కార్యదర్శి  రజత్ కుమార్, ఈఎన్సీ మురళీధర్ రావు, కాళేశ్వరం ఈఎన్సీ  హరిరామ్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రాంరెడ్డి, మహిళా కమిషన్ చైర్ పర్సన్ వి. సునీతా లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు