సాధారణ న్యాయ వాది నుండి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి వరకు జస్టిస్‌ ఎన్వీ రమణ

  ఎప్రిల్ 24 న పదవి భాద్యతలు స్వీకరించనున్న  జస్టిస్ ఎన్వీ రమణ


ఆంధ్రప్రదేశ్ లో ఓ సామాన్య వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగిన జస్టిస్‌ ఎన్వీ రమణ ను  దేశంలో అత్యున్నత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమిస్తూ రాష్ట్రపతి  రామ్ నాధ్ కోవింద్ మంగళవారం ఉత్తర్వులు జారి చేసారు. ఏప్రిల్ 24 న జస్టిస్ ఎన్వీ రమణ పదవి భాద్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా కొనసాగుతున్న జస్టిస్‌ ఎస్‌.ఏ బాబ్డే పదవీ కాలం ఏప్రిల్ 23 న ముగియనుంది. జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ పదవిలో 2021 ఏప్రిల్‌ 24 నుంచి 2022 ఆగస్టు 26 వరకు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

సినియారిటీ ప్రకారం జస్టిస్‌ ఎన్‌వీ రమణ ను తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని జస్టిస్‌ బాబ్డే సిఫారసు చేశారు. ఈ సిఫారసును ప్రభుత్వం ఆమోదించిన తరువాత.. జస్టిస్ రమణ సుప్రీంకోర్టుకు 48వ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. 2021 ఏప్రిల్ 24 నుంచి 2022 ఆగస్టు 26న పదవీ విరమణ చేసేంత వరకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించనున్నారు.

జస్టిస్ రమణ పూర్తిపేరు నూతలపాటి వెంకట రమణ. తెలుగు వారు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమింప బడటం ఇది రెండో సారి. గతంలో  జస్టిస్ కె. సుబ్బారావు సీజేఐగా పనిచేశారు. 

1957 ఆగస్టు 27న ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులది ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం కావడం విశేషం. జస్టిస్‌ రమణ 1983 ఫిబ్రవరి 10న బార్‌ అసోసియేషన్‌లో నమోదు చేసుకున్నారు. 2000 జూన్‌ 27న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా కూడా విధులు నిర్వహించారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొనసాగారు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు