పవన్ కళ్యాన్ ఏపీకి కాబోయే సిఎం అంటు అంధ్ర ప్రదేశ్ బిజెపి చీఫ్ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై వై.సి.పి నేతలు సెటైర్లు పేల్చారు. ఆలు లేదు చూలు లేదు గోవిందా అన్నట్లు ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ట్రోల్ చేస్తున్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోది పవన్ కళ్యాన్ ను పువ్వుల్లో పెట్టుకుని చుసుకోవలన్నారని అట్లాగే ఎపికి కాబోయే ముఖ్యమంత్రి అంటూ సోము వీర్రాజు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యలు ఎపి రాజకీయాల్లో కల కలం రేపాయి.
వై.సి.పి ఎంపి విజయ సాయి రెడ్డి సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ లో స్పందించారు. జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక అని గుర్తు చేసారు.
జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక. కాబోయే సీఎం ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటి? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా సీఎం కుర్చీ ఎక్కుతాడట! అంటు విజయ సాయిరెడ్డి ట్విట్టర్ స్పందనకు పవన్ కళ్యాన్ అభిమానులు విరుచుకుపడ్డారు. విజయ సాయి రెడ్డిని కడిగి పారేస్తు సోషల్ మీడియాలో ట్రోల్ చేసారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box