రాష్ట్ర ఎన్నికల కమిషన్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్కు షాక్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రద్దు చేసింది. పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమవారం హైకోర్టు ఈ పిటిషన్పై విచారణ జరిపింది. ఏపీ ఎన్నికల షెడ్యూల్ను ఎస్ఈసీ ఏకపక్షంగా ప్రకటించారని ప్రభుత్వం పేర్కొంది. వ్యాక్సినేషన్ ప్రక్రియకు షెడ్యూల్ అవరోధం అవుతుందని, ప్రజారోగ్యమే ముఖ్యమని స్పష్టం చేసింది. ప్రజారోగ్యం దృష్ట్యా షెడ్యూల్ రద్దు చేస్తున్నామని, ఆర్టికల్ 14, ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కు కాపాడాల్సిందే.. ప్రజలకున్న హక్కులను కాలరాయలేమని ప్రకటించింది. ప్రభుత్వ వాదనలతో పూర్తిగా ఏకీభవిస్తూ.. ప్రభుత్వం సూచనలను ఎస్ఈసీ పట్టించు కోలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box