ఎపిలో వివిద శాఖలలో పనిచేస్తున్న కాంటాక్టు ఉద్యోగుల సర్వీసు 2021 మార్చి వరకు పొడిగిస్తూ ఎపి సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ఇందుకు సంభందించిన ఉత్తర్వులు జారి చేసారు. వైద్య, ఆరోగ్య శాఖ, న్యాయ శాఖ, యువజన సర్వీసులు, విద్యాశాఖ, పర్యాటక శాఖల్లో పనిచేస్తున్న కాంటాక్టు ఉద్యోగుల సర్వీసును పొడిగించారు. వీరికి సాధారణ ఉద్యోగుల రీతిలో నెల నెల జాప్యం లేకుండా జీతాలు ఇవ్వాలని సిఎం ఆదేశించారు. పర్మనెంట్ ఉద్యోగుల మాదిరిగానే వారికి సామాజిక, ఆరోగ్య భత్రత కల్పించే విదంగా అధ్యయనం చేయాలని సిఎం సూిచంచారు. త్వరలో తనకు పూర్తి వివరాలతో నివేదక ఇవ్వాలని ఆదేశించారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box