కాళోజి ఆరోగ్య విశ్వావిద్యాలయం లో ఎంబీబీఎస్, బి డి ఎస్ అడ్మిషన్లు ప్రారంభం అయినట్లు వైస్ చాన్స్ లర్ కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో తెలిపారు.
బుధవారం ఆయన హన్మకొండలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి వరకు 6వేల మంది అడ్మిషన్ల కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని తెలిపారు. నీట్ లో రాేకు పొందిన విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 4800 సీట్ల భర్తి చేస్తామని తెలిపారు. ఈ డబ్ల్యుఎస్ 190 సీట్లు, గవర్నమెంట్ కాలేజీలల్లో 1500 సీట్లు, ప్రయివేట్ కాలేజీలల్లో 2750 సీట్లు, మైనార్టీ కాలేజీలల్లో 550 సీట్లు,
13 డెంటల్ కాలేజీలలో 1340 సీట్లు ఖాళీగు ఉన్నాయని చెప్పారు. వెబ్ ఆప్షన్ల ద్వారా సీట్ల కేటాయిస్తామని చెప్పారు. ప్రస్తుతం కరోనా నేపద్యంలో కేవలం ఆన్ లైన్ లో మాత్రమే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేస్తున్నామని
కళాశాలలు ప్రారంభం అయిన తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపారు. ఆన్ లైన్ లో సర్టి ఫికేట్లు అప్ లోడ్ చేయకుంటే క్వాలిఫై కానట్లేనని తెలిపారు. తరగతులు ఎప్పుడు ప్రారంభించేది ప్రబుత్వ నిర్ణయం మేరకు ఆధార పడి ఉందని తెలిపారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box