తెలుగు సినిమా ఇండస్ట్రీలో సాయిపల్లివి పట్ల ప్రేక్షకులు ఫిదా ఆయ్యారు. తమిళ అమ్మాయి అయిన సాయిపల్లవి ముద్దు ముద్దుగా ప్రత్యేకమైన తన గొంతుతో మాట్లాడే తెలంగాణ యాస డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి. ఆమె తెలుగు చిత్ర ప్రవేశం ఫిదాతో మొదలైంది. ఇండస్ట్రీలో తాజా వార్త ఏంటంటే మరో తార సౌందర్య బయోపిక్ ప్రారంభం కాబోతున్నదట. మహానటి బయోపిక్ బాగా హిట్ కావడంతో సౌందర్య బయోపిక్ పే ప్రముఖ మళయాల చిత్ర నిర్మాణ సంస్థ దృషస్టి సారించిందట. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సౌందర్య బయోపిక్ నిర్మించనున్నారు. ఇందుకు సంభందించిన స్క్రిప్ట్ కూడ దాదాపు ఫైనల్ అయిందట. ఇక అనౌన్స్ చేయడమే తరువాయి అని చెబుతున్నారు.
సౌందర్య కూడ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో అనేక సక్సెస్ ఫుల్ చిత్రాలలతో బాగా ఫేమ్ అయింది. హీరోయిన్ గా మహిళల సెంటమెంట్ పాత్రలతో ప్రేక్షకుల హృదయాలలో నిలిచి పోయింది.
0 వ్యాఖ్యలు
Please Do not enter any spam link in the comment box