అనుముల మండలం పాలెం స్టేజీ వద్ద పెట్రోల్ పోసుకొని ప్రేమికుల ఆత్మహుతి.
పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకుని సెల్ఫీ వీడియో తీసి ఫ్రెండ్స్ కి పంపిన ప్రేమికులు.
లొకేషన్ ట్రేస్ చేసి ఫ్రెండ్స్ వచ్చే వరకే పూర్తిగా కాలిపోయి విగత జీవులుగా మారిన వైనం.
షేక్ మస్తాన్ వలిది నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం కుంటిగొర్ల గూడెం.
కాగా అశ్వినిది నిజామాబాద్ జిల్లా
ఎడవెల్లి మండలం,
జకంపేట.
చనిపోతున్నానని తన తల్లికి వీడియో కాల్ చేసి చూపిన అశ్విని.
వీరిద్దరూ హైదరాబాద్ లో ఒకే కంపెనీలో జాబ్ చేస్తారని తెలుస్తుంది.
వీరిద్దరూ నిన్న రాత్రి వారు బైక్ మీద సాగర్ కి వచ్చి సరదాగా గడిపినట్లు సమాచారం.
అశ్విని,
షేక్ మస్తాన్ వలి
ఇద్దరూ చెవిటి మూగ వారు కావడం గమనార్హం.
మస్తాన్ వలికి ఇదివరకే 4 ఏళ్ల క్రితం పెళ్లయ్యి భార్య కూడా ఉంది.
ఇద్దరి విషయం ఇంట్లో తెలిసిందని భయపడి ఈ దారుణానికి ఒడిగట్టినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్న ఫ్రెండ్స్.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box