కరోనా కట్టడిలో ప్రభుత్వ విధానాలు సరిగా లేవని అసంతృప్తి వ్యక్తం చేసిన హైకోర్టు


'గాంధీ'లో కరోనా టెస్టులు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం
ప్రైవేటు ఆసుపత్రులను నియంత్రించాలని స్పష్టీకరణ
యశోద, కిమ్స్ లపై ఏం చర్యలు తీసుకున్నారన్న న్యాయస్థానం


కరోనా వైద్య పరీక్షలు,చికిత్సల విషయంలో ప్రభుత్వ విధానాలపై రాష్ర్ట హై కోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.ప్రైవేట్ ఆసుపత్రులు, లాబరేటరీలలో నిర్దిష్టంగా ఫీజులు ఖరారు చేయాలని సూచించింది. తెలంగాణలో కోవిడ్‌ నోడల్‌ కేంద్రంగా ఉన్న గాంధీ ఆస్పత్రిలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో కరోనా పరీక్షలు, బాధితులకు అందుతున్న చికిత్సపై మంగళవారం హైకోర్టు విచారణ చేపట్టింది. గాంధీ ఆస్పత్రిలోనూ కరోనా పరీక్షలు జరపాలని ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశించింది. కేంద్రం కల్పించిన అధికారాలతో ప్రైవేటు ఆస్పత్రులను నియంత్రించాలని సూచించింది. కరోనా బాధితులకు 4 లక్షల రూపాయలకు పైగా బిల్లులు వేసిన యశోద, కిమ్స్‌ ఆస్పత్రులపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అలాగే ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లో అన్ని రకాల పరీక్షలకు గరిష్ట చార్జీలు ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆస్పత్రుల్లో బెడ్లు, వెంటిలేటర్ల వివరాలను విస్తృత ప్రచారం చేయాలని సూచించింది. నాచారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో కరోనా చికిత్సలు చేస్తారా లేదో చెప్పాలని ప్రశ్నించింది. పూర్తి వివరాలతో ఈ నెల 27లోగా నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీచేసింది.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు