జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కలేజీ స్పూర్తిగా కాలేజీల్లో గార్డెన్లు అభివృద్ది చేయాలి...సిఎం కెసిఆర్

జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కలేజిలో గార్డెన్ అభివృద్ధి చేసి, అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా అభినందించారు. 



జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కలేజీని స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ డిగ్రీ కలేజీల్లో వివిధ రకాల మొక్కలతో గార్డెన్లను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కలేజిలో గార్డెన్ అభివృద్ధి చేసి, అక్కడే తెలంగాణ బొటానికల్ గార్డెన్ ఏర్పాటుకు కృషి చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సదాశివయ్యను ముఖ్యమంత్రి శుక్రవారం ప్రగతి భవన్ లో ప్రత్యేకంగా అభినందించారు. ఆయన ప్రదర్శించిన సేవా నిరతిని కొనియాడారు. జడ్చర్లలో ఏర్పాటు చేసే బొటానికల్ గార్డెన్ కు కావాల్సిన రూ. 50 లక్షల నిధులను ముఖ్యమంత్రి మంజూరు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి  ఎస్. నిరంజన్ రెడ్డి, మాజీ మంత్రి  సి. లక్ష్మారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి  చిత్రా రామచంద్రన్ తదితరులు పాల్గొనారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని కాలేజీల్లో ఇలాంటి ప్రయత్నం జరగాలన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో పనిచేస్తున్న బాటనీ అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి, వారి ఆధ్వర్యంలో వివిధ రకాల మొక్కలతో గార్డెన్ అభివృద్ధి చేసి కార్యాచరణ రూపొందించాలని సీఎం ఆదేశించారు.
తెలంగాణకు మాత్రమే సొంతమైన నల్లమలలో పెరిగే ఆండ్రో గ్రాఫిన్ నల్లమలయాన మొక్కను ముఖ్యమంత్రి సదాశివయ్యకు బహుకరించారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు