కాపు సామాజిక వర్గ మహిళల బాంకు ఖాతాల్లో నగదు జమ-'వైఎస్సార్ కాపు నేస్తం’ ప్రారంభించిన ఎపి సిఎం జగన్ మోహన్ రెడ్డి

వైఎస్సార్ కాపు నేస్తం ప్రారంభించిన ఎపి సిఎం వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కాపు మహిళలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ కాపు నేస్తం’కింద ఆర్థిక సహాయం చేసే పథకానికి బుధవారం శ్రీకారం చుట్టారు.వీడియోకాన్ఫరెన్సు ద్వారా పథకాన్నిప్రారంభించారు.ఈ పథకం కింద ఒక్కో మహిళకు ఏటా రూ 15 వేల చొప్పున ఆర్థిక సహాయం అంద చేస్తారు.బియ్యం కార్డు ఉన్న 45 నుంచి 60 ఏళ్ల వయసున్న గల కాపు,బలిజ, తెలగ, ఒంటరి తదితర సామాజిక  కులాలకు చెందిన వారికి రూ.15 వేల చొప్పున వారి అక్కౌంట్లలో జమ చేసారు.బాంకుల్లో వేసిన డబ్బులను పాత బాకీల కింద జమ చేసుకోకుండా అన్‌ ఇన్‌కమ్‌బర్డ్‌ ఖాతాలో వేసినట్లు జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.

'ఎలాంటి వివక్ష, అవినీతికి తావు లేకుండా బ్యాంక్‌ ఖాతాల్లో నగదు జమ చేశాము. గొప్ప మార్పుతో ఈ 13 నెలల పాలన కొనసాగింది. మనకు ఓటు వేయకపోయినా, అర్హత ఉంటే మంచి జరగాలని ఆరాటపడ్డాం. అవినీతికి తావు లేకుండా పథకాలు అమలు చేశాము. కులం, మతం, రాజకీయాలు, పార్టీలు చూడలేదు. ఇవాళ కాపు అక్కా చెల్లెమ్మలు, అన్నదమ్ములకు ఈ ఏడాది ఎంత ఖర్చు చేశామని చూస్తే.. అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యా దీవెన, వాహనమిత్ర, చేదోడు, విదేశీ విద్యా దీవెన, కాపు నేస్తం వంటి పథకాల ద్వారా 23 లక్షలకు పైగా లబ్ధిదారులకు అక్షరాలా రూ.4,770 కోట్లు ఇవ్వడం జరిగిందని 'సిఎం జగన్ అన్నారు.

'ఇంకా రాని వారు ఎవరైనా ఉంటే ఆందోళన చెందవద్దు. ఎలా ఎగ్గొట్టాలని కాకుండా, ఎలా మేలు చేయాలని ఆలోచించే ప్రభుత్వం.అర్హుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. మీ పేరు లేకపోతే, మీకు అర్హత ఉంటే, వెంటనే దరఖాస్తు చేసుకోండి.వచ్చే నెల ఇదే రోజున తప్పనిసరిగా ఆర్థిక సహాయం చేస్తాం..గుండెల మీద చేయి వేసుకుని పాలనలో తేడా చూడండి..గత ప్రభుత్వం ఏం చెప్పింది? ఏం చేసింది?చూడండి'అని అన్నారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు