పివి చిత్ర పటానికి అంజలి ఘటిస్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్..

భారతదేశ సంస్కారం ప్రపంచానికి తెలియజేసిన గొప్ప వ్యక్తి పీవీ నరసింహరావు అని,ఆయన తెలంగాణ బిడ్డ అయినందుకు గర్వంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్  రావు కొనియాడారు.

ఆదివారం నెక్లెస్ రోడ్ లోని పీవీ జ్ఞానభూమి వద్ద  ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి అంజలి ఘటించిన అనంతరం పివి శత జయంతి ఉత్సవాలు ప్రారంభించారు.
పివి శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు సిఎం కెసిఆర్ 10 కోట్లను కెటాయించారు.తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏడాదిపాటు నర్సింహారావు శత జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ నరసింహారావు గురించి చెప్పడానికి కొంత సాహసం కావాలని,ఒక్క మాటలో చెప్పాలంటే 360 డిగ్రీల మహోన్నత వ్యక్తిత్వం ఆయన స్వంతమని అన్నారు.
'దేశానికి గొప్పగా దిశానిర్దేశం చేసిన వ్యక్తికి రావాల్సిన గౌరవం లభించలేదు. మన రాష్ట్రం తరపున పీవీకి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా చేయాలి.ఆయన విధానాలను ముందు తరాలకు తెలియజేస్తే వ్యక్తిత్వ నిర్మాణానికి ప్రతీక అవుతుంది' అని కేసీఆర్ అన్నారు.


అందుకు తగ్గట్లుగానే ఆయన మాటకు ఎంతో విలువ ఉండేదని అన్నారు. పీవీ గురించి వర్ణించేందుకు మాటలు చాలవని కేసీఆర్ అన్నారు. పీవీ స్థాపించిన పాఠశాల నుంచి ఎంతో మంది ఐపీఎస్‌లు వచ్చారని అన్నారు. తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి కూడా ఆయన పాఠశాల నుంచి వచ్చిన వారే అని గుర్తు చేశారు. నవోదయ వంటి పాఠశాల ఏర్పాటులో పీవీ భాగస్వామ్యం ఎంతో ఉందని అన్నారు.
పీవీ 1200 ఎకరాల భూస్వామి. తమకు ఓ 150 ఎకరాలు ఉంచుకొని మిగతా అంతా ఉదారంగా ప్రభుత్వానికి అప్పగించిన వారు. అందుకే పీవీ మన ఠీవీ అని నేను అంటున్నా. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా ఎన్నో సంస్కరణలు తెచ్చారు. ముఖ్యంగా భూసంస్కరణలు. గెలుపులో, ఓటమిలో ఎప్పుడూ నిశ్చలంగా ఉండే వ్యక్తి. ఎన్ని విమర్శలు వచ్చినా తన లక్ష్యం చేరేవరకూ పట్టు సడలించేవారు కాదు. ఆయన ప్రధాని అయ్యే సమయానికి దేశమంతా అంధకారమయంలో ఉంది. ఉన్న బంగారమంతా విదేశీ బ్యాంకుల్లో పెట్టి పరువు నిలబెట్టుకున్న సందర్భం అది. అలాంటి సందర్భంలో ఆయన్నే వెతుక్కుంటూ పదవి వచ్చింది. ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక స్థితిని గట్టెక్కించారని అన్నారు
ఉత్సవాలలో 

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు