రేవంత్ రెడ్డి |
ఉన్నత పదవుల్లో నియామకం జరిగిన అధికారుల్లోనర్సింగరావు, వేణుగోపాల్ రావు, కిషన్ రావు, మదన్ మోహన్ రావు, విజయ్ కుమార్ రావు, వెంకట్రావు, రమణారావు, రాఘవరావు, వెంకటరమణారావులు ఉన్నారని వీరంతా రిటైరైనా వారిని పిలిపించుకుని కీలక పదవుల్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. వీరిలో చాలామంది కేసీఆర్ కు అనుకూలంగా పనిచేయడానికి పలు కీలక శాఖల్లో నియమితులయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరందరు ప్రభుత్వ కీలక విభాగాలలో ఉన్నారని కొందరు ఎస్ఐబిలో మరి కొందరు ఇంటెలిజెన్స్ విభాగంలో, ఏసీబీలో, పోలీస్ అకాడమీలో పదవులు పొందారని వివరించారు. రిటైరైన వారిలో ఎంతో సమర్థవంతమైన అధికారులు ఉన్నా, వారిని పక్కనబెట్టారని, తనవారిని తీసుకువచ్చి ప్రత్యర్థుల ఆసుపానులు కనిపెడుతూ ఎప్పటికప్పుడు సమాచారం అందించే బాధ్యతలు అప్పగించారని కేసీఆర్ పై మండిపడ్డారు.
0 కామెంట్లు
Please Do not enter any spam link in the comment box