తన సామాజిక వర్గం వారిని పిలిచి మరి ఉన్నత పదవులు కట్టబెట్టిండు - సిఎం కెసిఆర్ పై కాంగ్రేస్ ఎంపి రేవంత్ రెడ్డి ధ్వజం

రేవంత్ రెడ్డి 


తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ర్టంలో తన సామాజిక వర్గం వారిని పిలిచి మరి ఉన్నత పదవులు కట్టబెడుతున్నారని కాంగ్రేస్ ఎంపి రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేసారు.గత పది, పదిహేనేళ్లలో అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా పనిచేసిన తన బంధు వర్గాల వారిని రిటైరయ్యాక పిలిచి  సీఎం కేసీఆర్ వారికి ఉన్నత పదవులు కట్టబెట్టాడని అన్నారు.భందువర్గాల వారందరికి పెద్ద పదవులే అప్పగిస్తున్నారని ఆరోపించారు. వారంతా ఓఎస్డీలుగా, ఎస్పీలుగా పనిచేస్తున్నారని వెల్లడించారు. ఇలాంటి నియామకాల కారణంగా టెలిఫోన్ ట్యాపింగ్ అనేది యధేచ్చగా నిరాటంకంగా సాగుతోందని తెలిపారు.

ఉన్నత పదవుల్లో నియామకం జరిగిన అధికారుల్లోనర్సింగరావు, వేణుగోపాల్ రావు, కిషన్ రావు, మదన్ మోహన్ రావు, విజయ్ కుమార్ రావు, వెంకట్రావు, రమణారావు, రాఘవరావు, వెంకటరమణారావులు ఉన్నారని వీరంతా రిటైరైనా వారిని పిలిపించుకుని కీలక పదవుల్లో కూర్చోబెట్టారని మండిపడ్డారు. వీరిలో చాలామంది కేసీఆర్ కు అనుకూలంగా పనిచేయడానికి పలు కీలక శాఖల్లో నియమితులయ్యారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వీరందరు ప్రభుత్వ కీలక విభాగాలలో ఉన్నారని కొందరు ఎస్ఐబిలో మరి కొందరు ఇంటెలిజెన్స్ విభాగంలో, ఏసీబీలో, పోలీస్ అకాడమీలో పదవులు పొందారని వివరించారు. రిటైరైన వారిలో ఎంతో సమర్థవంతమైన అధికారులు ఉన్నా, వారిని పక్కనబెట్టారని, తనవారిని తీసుకువచ్చి ప్రత్యర్థుల ఆసుపానులు కనిపెడుతూ ఎప్పటికప్పుడు  సమాచారం అందించే బాధ్యతలు అప్పగించారని కేసీఆర్ పై మండిపడ్డారు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు