ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు: మొత్తం 2282, మరణాలు 50


ఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.. ఒక రోజు కేసులు తగ్గితే.. మరో రోజు మళ్లీ పెరుగుతున్నాయి. ఆదివారం 25 కేసులుంటే.. సోమవారం ఆ సంఖ్య పెరిగింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 52 పాజిటివ్ కేసులు నమోదైనట్లు బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. కృష్ణా, చిత్తూరు జిల్లాల్లో 15 చొప్పున.. నెల్లూరు జిల్లా 7, తూర్పుగోదావరి జిల్లా 5, కర్నూలు జిల్లా 4.. కడప, పశ్చిమగోదావరి జిల్లాల్లో రెండేసి చొప్పున.. విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఒక్కో కేసు నమోదైంది. తాజా కేసులు కలిపితే మొత్తం సంఖ్య 2282కు చేరగా.. డిశ్చార్జ్ అయిన వారు కాకుండా యాక్టివ్ కేసులు 705గా ఉన్నాయి.

రాష్ట్రంలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 615 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తర్వాత గుంటూరు జిల్లాలో 417 కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 1527మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనాతో మొత్తం 50మంది చనిపోయారు. అయితే ఇవాల్టి లెక్కల్లో చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో 15 చొప్పును కేసులు కేసులు నమోదయ్యాయి. తాజాగా చిత్తూరు జిల్లాతో పాటూ మరికొన్ని జిల్లాల్లో నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ కోయంబేడు మార్కెట్ లింకులు ఉన్నట్లు తెలుస్తోంది.

జిల్లాల వారీగా మొత్తం కేసుల వివరాలు ఇలా ఉన్నాయి.

కర్నూలు జిల్లా 615
గుంటూరు జిల్లా - 417
కృష్ణా జిల్లా - 382
చిత్తూరు జిల్లా - 192
నెల్లూరు జిల్లా -157
అనంతపురం జిల్లా -122
కడప జిల్లా -104
విశాఖపట్నం జిల్లా -76
పశ్చిమ గోదావరి జిల్లా - 72
ప్రకాశం జిల్లా - 66
తూర్పుగోదావరి జిల్లా - 55
శ్రీకాకుళం జిల్లా - 14
విజయనగరం జిల్లా -8
మొత్తం కేసులు -2157

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు